జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ, బాలికల హక్కులు, గౌరవం, అభివృద్ధిపై సమాజాన్ని చైతన్యపరిచే ముఖ్యమైన సందర్భంగా నిలుస్తోంది. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు, వివక్ష, భద్రత సమస్యలపై అవగాహన కల్పిస్తూ, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ దినోత్సవం గుర్తు చేస్తోంది.
బాలికలకు సమాన హక్కులు, గౌరవం కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. కుటుంబంలోనూ, విద్యా వ్యవస్థలోనూ, ఉద్యోగ రంగాల్లోనూ బాలికలను పురుషులతో సమానంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలిక విద్యే సమాజ అభివృద్ధికి పునాది అని గుర్తించి, ప్రతి ఆడపిల్లకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం, తల్లిదండ్రులు, సమాజం కలిసికట్టుగా పనిచేయాలి.ఆడపిల్లలకు భద్రతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కల్పించడమే కాకుండా, తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వేదికలను అందించాలి. చదువు, క్రీడలు, కళలు, విజ్ఞానం, రాజకీయాలు వంటి ప్రతి రంగంలో బాలికలు ప్రతిభను చాటుతున్న నేటి కాలంలో, వారికి అండగా నిలవడం మన కర్తవ్యంగా మారింది.ఆత్మవిశ్వాసంతో ఎదిగిన బాలికలే రేపటి దేశ నాయకులుగా రూపుదిద్దుకుంటారు.బాలికల సాధికారతే బలమైన భారతదేశానికి మార్గమని గుర్తించి, ఆడపిల్లలపై జరుగుతున్న వివక్షను పూర్తిగా నిర్మూలించాలి. ‘ఆడపిల్ల భారం కాదు, దేశానికి వరం’ అనే భావన ప్రతి మనసులో బలంగా నాటుకోవాలి. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సంకల్పం చేయడమే ఈ దినోత్సవానికి నిజమైన నివాళి.