బయ్యారం/జనవరి 23(జర్నలిస్ట్ వార్త);
మండల కేంద్రంలోని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల తహశీల్దార్ కార్యాలయంలో,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞను మండల తహశీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులతో చేపించారు.ఈ సందర్బంగా తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ నా దేశం - నా ఓటు అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు.