పరపతి సంఘాలు సభ్యుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలివేలేరులో శ్రీ మార్కండేయ గణపతి పరపతి సంఘం వార్షికోత్సవం

journalist vaartha
By -

వేలేరు/, జూలై 19 (జర్నలిస్ట్ వార్త): పరస్పర సహకారం, ఆర్థిక క్రమశిక్షణతో నడిచే పరపతి సంఘాలు సభ్యుల ఆర్థికాభివృద్ధికి బలమైన వేదికలుగా నిలవాలని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా యాదగిరి అన్నారు.
వేలేరు మండల కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో ఆదివారం నిర్వహించిన శ్రీ మార్కండేయ గణపతి పరపతి సంఘం నాలుగో వార్షికోత్సవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరపతి సంఘాల ద్వారా సభ్యుల్లో పొదుపు అలవాటు పెంపొందించడంతో పాటు అవసరమైన సమయంలో తక్కువ వడ్డీతో రుణాలు అందించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సంఘ సభ్యులంతా పరస్పర విశ్వాసం, క్రమశిక్షణతో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించి, సంఘ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
సమావేశానికి సంఘం అధ్యక్షుడు రాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షుడు ప్రభాకర్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రమేష్, నాయకులు సదానందం, కోటేశ్వర్, ప్రసాద్, సురేష్, నరేష్, మల్లేష్, మహేందర్‌తో పాటు పెద్ద సంఖ్యలో పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.