వరంగల్, జులై 16(జర్నలిస్ట్ వార్త): వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది నిమ్మాని శేఖర్రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) లీగల్ సెల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. శేఖర్రావుకు ఉన్న రాజకీయ చతురత, చట్టపరమైన అంశాలపై ఉన్న పట్టును గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఆయనకు ఈ ప్రాధాన్యత కలిగిన బాధ్యతలను కట్టబెట్టింది. జిల్లా స్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వ విధానాలపై అధికారికంగా స్పందించే బాధ్యతలను కాంగ్రెస్ వర్గాలు ఆయనకు అప్పగించాయి.
విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ, పార్టీ వాణిని సముచితంగా వినిపించడంలో శేఖర్రావు నియామకం ఎంతగానో దోహదపడనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
నిమ్మాని శేఖర్రావు నియామక వార్త వెలువడటంతో వరంగల్ జిల్లావ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవుతోంది. జిల్లాలో పార్టీ వాయిస్ను బలంగా వినిపించేందుకు ఒక సమర్థుడైన న్యాయవాదిని ఎంపిక చేయడం సరైన నిర్ణయమని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. ఈ నియామకంపై జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శేఖర్రావుకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. నియోజకవర్గాల పరిధిలోని అనుబంధ సంఘాల నేతలు, ముఖ్య కార్యకర్తలు ఆయనను స్వయంగా కలిసి శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకముంచి జిల్లా అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించిన అధిష్ఠానానికి శేఖర్రావు కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.